Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

వేదము మన పెన్నిధి

శ్రీ స్వామివారు వేదమాతృస్తవమును విని యందలి యంశముల భక్తజనుల కందర కవగాహన మగు రీతిని వివరించి చెప్పుచు వేదసభను ప్రారంభించిరి.

శ్రీ స్వామివారు సంస్కృతమున సభను ప్రారంభించుచు నిట్లనిరి; 'వాంచం ధేను ముపాసీత' వేదవాక్కును ఉపాసనచేసిన కొలది యది వారిపాలిట కామధేనువగును. అట్టి కామధేనువు నుపాసించి దానిని నిలువుటకై తద్ధర్మ రక్షణకై ప్రత్యేకముగా నొక వర్ణ మేర్పడియున్నది.

''బ్రాహ్మణన నిష్కారణో షడంగో

వేదో7ధ్యేయోజ్ఞేయశ్చ -

బ్రహ్మణుడు ఎట్టిఫలము నపేక్షింపకయే షడంగ సహితమగు వేదము నధ్యయనము చేయవలెను. ఇతర కార్యములు నొనర్చునపుడు ఫలాపేక్ష యుండును. ఫలాపేక్షలేకయే యవశ్యము చేయదగినది వేదాధ్యయనము, వేదముల నధ్యయనము జేయుచు వానిని పాలింప వలసినది బ్రాహ్మణవర్ణము. కాలక్రమమున వేదాధ్యయనము లోపించుటచే వైదికధర్మ వ్యవస్థానురూపములయిన వివిధ కులవృత్తులును రూపుమాపి పోవుచున్నవి.

ధర్మము పురుషబుద్ధి కల్పితమయ్యెనేని దానికి నిలుకడ యుండదు. ఆయా సాంఘీక రాజకీయ పరిస్థితులను బట్టి అది ఎప్పటికప్పుడు మారుచుండును. నేటి ధర్మము రేపు అధర్మము గావచ్చును. అట్టి ధర్మము పురుషార్థసాధక మెట్లగును? ధర్మము పురుషార్థసాధకము కావలెననిన అది పురుషబుద్ధి కల్పితము కాగూడదు. శాశ్వతమయినది గావలెను. అట్టి ధర్మమును బోధించునది వేదము. కాన దేశ కాలపరిస్థితుల ప్రభావమునకు లోనుగాక, వేదమును, తద్వారా ధర్మమును, తద్విరుద్ధములగు అనాది భారతీయ కులవృత్తులను పునరుద్ధరించుకొనవలెను.

వేదము నిధివంటిది, ఆనిధి గోవుచిహ్నమే, మేము ధరించు ఈదండము, నిధిని రక్షించుటకు పురుషునిచేతిలో నొక దండ ముండును, ఉపనయన సంస్కారము పొందగనే బ్రాహ్మణుడు నిధిరక్షకు డగును, బ్రాహ్మణుడు రక్షింపవలసిన నిధి వేదనిధియే, బ్రాహ్మణునకు బైల్వ, పాలాశ, దండములు విహితములు, న్యగ్రోధాదులు క్షత్రియాదులకు విహితములు, బ్రాహ్మణుడు దండమును స్వీకరించుచు ''బ్రహ్మణో నిధిగోపో భూయాసం'' అని చెప్పును. ఆ వేదనిధిని రక్షింపని నాడు బ్రాహ్మణుని బ్రాహ్మణత్వము తనకుగాని, ఇతరులకుగాని సుఖదాయకము కాకపోగా ఉభయులకును దుఃఖదాయకమే కాగలదు.

'ఉచ్చైర్గతి ర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్‌

తస్య ప్రమా చ వచనై ః కృత కేతరశ్చేత్‌ |

తేషాం ప్రకాశన దశా చ మహీ సురైశ్చేత్‌

తా నంతరేణ నిపతే త్క్వనమత్ర్పణామః ||

లోకమున యున్నతస్థితిని కోరనివాడుండడు. అట్టి స్థితి అధర్మమువలనగాక ధర్మముచేతనే సిద్ధించినట్లయితే అట్టి ధర్మమును అపౌరుషేయ మగు వేదముగాక మరియేది జోధింపజాలును! అట్టి వేదమును లోకమున బ్రకాశింపజేయునది భూసురులగుచో వారినిగాక మరియెవ్వరికి నేను నమస్కరింతును.

ఈ శ్లోకము భోజరాజకృత చంపూరామాయణములోనిది. భోజుడు క్షత్రియుడు. భోజ కాళిదాసాది మహాకవులును ఆయాదేశ ప్రభావ కాలములకుగాని, ఈర్వాద్వేషాదులకుగాని లోనుగాక, లోకమున ఉన్నత స్థితికి మూలమైనది అనాదిసిద్ధమైన వైదిక ధర్మమనియే జెప్పిరి. అట్టి ధర్మమును రక్షించుకొనవలెననిన వేద సంరక్షణము గావించుకొనవలెను.

వేద సంరక్షణకై యేర్పడినది. బ్రాహ్మణవర్ణము వేదసంరక్షణ జేయని నా డావర్ణమే యనవసరము. కాన బ్రాహ్మణవర్ణము వారు వేదమును మొదట తమపిల్లలచే నధ్యయనము జేయించి పిదప మిగిలినవారికి జెప్పవలెను.

వేదమునకు శ్రుతి యనిపేరు. ఇది యితర గ్రంథ విలక్షణమయినది. ఇతర గ్రంథములు క్రిమిదుష్టములయినను, ప్రచురించువారు లేకపోయినను లుప్తములు గావచ్చును, వేదము లట్లుగావు. ఉచ్చారణా నూచ్చారణ పూర్వకముగా గురుశిష్యపరంపరా ప్రాప్తములు. కాన వీనికి శ్రుతులని పేరు. దీనిని యితర గ్రంథములవలె స్వయముగా గాక గురుముఖముననే వల్లించి ధారణ చేయవలెను.

8-10ొ


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page